స్కూల్ ఆటో బోల్తా.. విద్యార్థులకు తీవ్ర గాయాలు

స్కూల్ ఆటో బోల్తా..  విద్యార్థులకు తీవ్ర గాయాలు

విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలవగా ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. చౌదర్ గూడ నుంచి చూడర్ పూర్ వెళ్తున్న సమయంలో ఆటో బోల్తా పడింది. స్థానికంగా ఉన్న ప్రజలు గాయాలైన విద్యార్థులను సమీప హాస్పిటల్ కు తరలించారు.