బడి బస్సులు తాగి నడుపుతున్నరు ..ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడ్డ ఐదుగురు డ్రైవర్లు

బడి బస్సులు తాగి నడుపుతున్నరు ..ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడ్డ ఐదుగురు డ్రైవర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలోని పలు ప్రైవేట్​స్కూళ్ల బస్ డ్రైవర్లు తాగి బస్సులు నడుపుతున్నారు.  బుధవారం ఐదుగురు డ్రైవర్లు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నగర్, మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లి, బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి, తిరుమలగిరి, మహంకాళి, గోపాలపురం ప్రాంతాల్లోని 34 చోట్ల ట్రాఫిక్​ పోలీసులు స్పెషల్​డ్రైవ్​ నిర్వహించారు. ప్రత్యేకంగా స్కూల్ బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్​ డ్రైవ్​టెస్టులు చేశారు. మొత్తం 324 స్కూల్ బస్సు డ్రైవర్లను తనిఖీ చేశారు. వీరిలో ఐదుగురు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.