వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 50మంది వికలాంగులకు హోండా స్కూటీలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు.. ఒక్కొక్కరికీ  రూ.1లక్ష 4వేల విలువ గల బండిని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.1వెయ్యి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారన్న ఆయన.. పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ లు అని విమర్శించారు.

దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే రూ.3వేల16పెన్షన్ ఇస్తున్నారని హరీష్ రావు చెప్పారు. వికలాంగులు సకలంగులను పెళ్లి చేసుకుంటే డబుల్ కళ్యాణ లక్ష్మి పథకం వస్తుందని, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే మూడు లక్షలు వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి గురించి సోషల్ మీడియా సొట్టకాయలను నెత్తిమీద పొడిచినట్టు చెప్పాలంటూ ఆయన కామెంట్స్ చేశారు.