రోడ్డుపై వెళ్తుండగా.. స్కూటీలో చెలరేగిన మంటలు

రోడ్డుపై వెళ్తుండగా.. స్కూటీలో చెలరేగిన మంటలు

మహబూబాబాద్ జిల్లాలో నడిరోడ్డుపై స్కూటీ తగలబడింది. స్కూటీపై వెళ్తుండగా అకస్మాత్తుగా ముందుబాగంలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన వాహనదారుడు స్కూటీని ఆపి దిగిపోయాడు. ఈ ఘటనలో స్కూటీ ముందుభాగంగా పూర్తిగా కాలిపోయింది. 


గూడూరు మండలం బోల్లేపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు స్కూటీలో మంటలు చెలరేగాయి. గుండెంగాకు చెందిన బోడ రవీందర్ స్కూటీపై వెళ్తుండగా...ముందు భాగంలో మంటలను స్థానికులు గుర్తించి రవీందర్కు చెప్పారు. దీంతో రవీందర్ బండిని ఆపి దిగిపోయాడు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేశారు.