మలయాళ నటుడు జయసూర్యపై మరో కేసు

మలయాళ నటుడు జయసూర్యపై మరో కేసు
  • సోనియా మల్హర్ ఫిర్యాదుతో నమోదు

తిరువనంతపురం: మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు సంచలనం సృష్టిస్తున్నది. తాము కూడా వేధింపులకు గురయ్యామంటూ పెద్ద సంఖ్యలో నటీమణులు, మహిళా టెక్నీషియన్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో 17 మంది నటులపై కేసులు నమోదయ్యాయి. నటుడు జయసూర్యపై శుక్రవారం పోలీసులు రెండో కేసు పెట్టారు. నటి సోనియా మల్హర్ ఫిర్యాదుతో ఆయనపై తిరువనంతపురం పోలీసులు ఐపీసీ సెక్షన్​ 354, 354ఏ(ఏ1)(ఐ) 354డీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గురువారం సోనియా మల్హర్ తన పూర్తిస్థాయి స్టేట్మెంట్ ఇచ్చాక ఈ కేసు పెట్టారు. 2013లో ఈ షాకింగ్ ఘటన జరిగినట్టు చెప్పారు. 

తొడుపుజలో షూటింగ్ జరిగింది. ఆ సినిమాలో నేనే లీడ్ ఆర్టిస్టును. జనరల్ ప్రాక్టీసులో భాగంగా తనను లొకేషన్​లోని జూనియర్​ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు పరిచయం చేయలేదు. లొకేషన్​లో మార్పు ఉంటుందని చెప్పారు. మేకప్ చేసుకొని కాస్ట్యూమ్ ఛేంజ్ చేసుకోవడానికి వాష్ రూమ్​కు వెళ్లా. బయటకు రాగానే జయసూర్య వచ్చి వెనకనుంచి నన్ను పట్టుకున్నడు. నేను స్టన్​ అయ్యాను. ఆ తర్వాత అతను సారీ చెప్పాడు. అయితే, ఆ సినిమాలో నా పాత్రను వేరే వారికి ఇచ్చారు. ఆ ఘటన తర్వాత నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను” అని మల్హర్ స్టేట్​మెంట్ ఇచ్చారు.