తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సిన్ రేపు బంద్

 తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సిన్ రేపు బంద్

హైదరాబాద్: తెలంగాణలో 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా నిలిచిపోయింది. తగినన్ని వ్యాక్సిన్ డోసులు లేని కారణంగా రేపు జరగాల్సిన రెండో డోస్ వ్యాక్సినేషన్ నిలిపివేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేంద్రం నుంచి తగినన్ని డోసులు రానందున రాష్ట్రంలో నిల్వలు అయిపోయాయని, దీంతో వ్యాక్సినేషన్ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. శనివారం నుండే తెలంగాణలో వ్యాక్సినేషన్ నిలిచిపోగా.. రేపు సోమవారం నుండి సెకండ్ డోస్ కూడా నిలిచిపోయింది.