రెండో విడత ర్యాండమైజేషన్​ పూర్తి

రెండో విడత ర్యాండమైజేషన్​ పూర్తి
  • రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్


నాగర్​ కర్నూల్, వెలుగు :  నాగర్ కర్నూల్  పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు శుక్రవారం పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్   పూర్తయినట్టు    కలెక్టర్​ ఉదయ్​ కుమార్​ తెలిపారు.  ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్ జైవన్షి సమక్షంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు   తెలిపారు. 1090 ప్రిసైడింగ్ ఆఫీసర్స్,1089 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 2266 ఓపిఓ,150 మైక్రో అబ్జర్వర్స్​కు ఎన్నికల విధులు కేటాయించినట్లు  చెప్ఆపరు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​  కలెక్టర్లు   కుమార్ దీపక్,  నగేష్  పాల్గొన్నారు.