మదర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో క్యూరియాసిటీ

మదర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో క్యూరియాసిటీ

డిఫరెంట్ స్ర్కిప్టులు సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. వాటిలో  రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’ ఒకటి. ఇందులో సుధీర్ ట్రిపుల్ రోల్‌‌‌‌‌‌‌‌లో  కనిపించనున్నాడు.

ఇప్పటికే ఆ పాత్రలకు సంబంధించి లుక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఓ పాట, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. శనివారం రెండో  పాటను విడుదల చేశారు. ‘అడిగా అడిగా.. విధినే అడిగా.. నను మోసిన అమ్మ ఒడిని గుడిగా’ అంటూ మదర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో సాగే  పాటలో సుధీర్ బాబు డిఫరెంట్ గెటప్స్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు. 

చిన్నప్పట్నుంచీ తన పాత్రల్లోని వేరియేషన్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటున్నాడు. చైతన్ భరద్వాజ్  పాట ట్యూన్ చేయగా, చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాశాడు. శ్రీనివాసన్ దొరైస్వామి పాడాడు. మృణాళిని రవి,  ఈషా రెబ్బా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు  కలిసి  నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 6న  సినిమా విడుదల కానుంది.