కైట్, స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..ఈ నెల 15 వరకు కొనసాగింపు

కైట్, స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..ఈ నెల 15 వరకు కొనసాగింపు
  •     స్పెషల్ ​పార్కింగ్ ​ఏర్పాటు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల15 వరకు జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్- సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని మల్కాజిగిరి ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్​రద్దీని బట్టి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీటీవో క్రాస్​ రోడ్స్, ప్లాజా క్రాస్​రోడ్స్, టివోలి క్రాస్​ రోడ్స్​మూసివేసే అవకాశం ఉంటుందని, అవసరాన్ని బట్టి డైవర్షన్స్​అమలు చేస్తామన్నారు.

 కైట్​ఫెస్టివల్​వల్ల పై ఏరియాలతో పాటు పికెట్​జంక్షన్​, సికింద్రాబాద్​క్లబ్(ఇన్​గేట్), ఎన్​సీసీ, స్వీకార్​ఉపకార్, వైఎంసీఏ, ఎస్​బీఐ జంక్షన్, బాలంరాయి, బ్రూక్​బాండ్, తాడ్​బండ్​క్రాస్​రోడ్స్, మస్తాన్​కేఫ్​వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. అందుకని సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్​వైపు వెళ్లే ప్రయాణికులు రద్దీ లేని సమయాల్లో ప్రయాణాలు ప్లాన్​చేసుకోవాలన్నారు.  

పార్కింగ్​ పాయింట్లు ఇవి..

కైట్​ఫెస్టివల్​కు వచ్చేవారి కోసం పలుచోట్ల పోలీసులు పార్కింగ్​పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్​నుంచి వచ్చేఈవెంట్ఆర్గనైజర్లు పరేడ్​గ్రౌండ్​ఈస్ట్​ గేట్​కు రెండు వైపులా పార్క్​చేసుకోవాలి. పంజాగుట్ట, ట్యాంక్​బండ్ నుంచి వచ్చే సాధారణ ప్రజల కోసం జింఖాన గ్రౌండ్స్​లో పార్కింగ్​ఏర్పాటు చేశారు. కూకట్​పల్లి, మేడ్చల్​, బోయినపల్లి నుంచి వచ్చే వారు దోభీఘాట్​లో పార్క్​చేసుకోవాల్సి  ఉంటుంది. దీంతోపాటు దోభీఘాట్​పార్కింగ్​పాయింట్​ నుంచి పరేడ్​గ్రౌండ్​కు షటిల్​బస్​సర్వీస్​ఉంటుందని పోలీసులు తెలిపారు.