'మిచౌంగ్' తుఫాన్ ఎఫెక్ట్: సికింద్రాబాద్ టు తిరుపతి ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ లో మార్పు

'మిచౌంగ్' తుఫాన్ ఎఫెక్ట్:  సికింద్రాబాద్ టు తిరుపతి ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ లో మార్పు

'మిచౌంగ్' తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నారు.  దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఏపీలోని కోస్తాంధ్ర, నెల్లూరు, చిత్తూరు జిల్లల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ట్రైన్ సమయంలో స్వల్ప మార్పు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్స్ ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించింది.

సికింద్రాబాద్ టు తిరుపతికి 12732 నంబర్  గల ఎక్స్ ప్రెస్ ట్రైన్ డిసెంబర్ 6వ తేదీ బుధవారం సాయంత్రం 4.15నిమిషాలకు బయల్దేరాల్సి ఉండగా అనివార కారణాలు వల్ల రీషెడ్యూల్ చేయాల్సి వచ్చినట్లు తెలిపింది.  ఈ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కొంత ఆలస్యంగా రాత్రి 8.15నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరనున్నట్లు వెల్లడించింది.