
- నేటి నుంచే అందుబాటులోకి..
- కాచిగూడ - తిరుపతి మధ్య ఏసీ ట్రైన్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: సికింద్రాబాద్ – హైదరాబాద్ నుంచి కర్నాటకలోకి అర్సికెరెకు, కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఆర్సికెరె (07079 )కు ప్రతి ఆదివారం ఉదయం 6.05 గంటలకు ఉంటుందని, ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు నడుపనున్నట్లు పేర్కొన్నారు. అర్సికెరె – సికింద్రాబాద్(07080) మధ్య ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందని, ఈరైలు14 నుంచి సెప్టెంబరు 1 వరకు నడుస్తుందని చెప్పారు.
ఈ రైళ్లు బేగంపేట, వికారాబాద్, ఎలహంక రూట్లో వెళ్తాయన్నారు. అలాగే, హైదరాబాద్– అర్సికెరె(070769) మధ్య ప్రతి మంగళవారం ఉదయం 7.20 గంటలకు మరో ట్రైన్ ఉంటుందన్నారు. ఈ రైలు ఈనెల 8 నుంచి ఆగస్టు 26 వరకు నడుస్తుందన్నారు. అర్సికెరె – హైదరాబాద్(07070 ) ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందని, ఈ నెల 9 నుంచి ఆగస్టు 27 వరకు నడుస్తుందన్నారు.
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి కాచిగూడ, కర్నూల్సిటీ, తూంకూరు మీదుగా వెళ్తుందన్నారు. కాచిగూడ – తిరుపతి(07676) మధ్య ప్రతి మంగళవారం 11.30 గంటలకు ఒక రైలు ఉంటుందని, ఈ నెల 8న అందుబాటులో ఉంటుందని తెలిపారు. జడ్చర్ల , కడప , రేణిగుంట నుంచి వెళ్తాయని, ఇవన్నీ ఏసీ కోచ్లే అని వివరించారు.