కశ్మీర్లో ఎన్కౌంటర్లో..నలుగురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్లో ఎన్కౌంటర్లో..నలుగురు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్లో భద్రతాబలగాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా.. బిజ్ బెహరా ప్రాంతంలో ఒక ఉగ్రవాది మరణించినట్లు పోలీసులు తెలిపారు. అవంతిపోరాలో హతమైన ముగ్గురు టెర్రరిస్టులలో ఒకరు భద్రతా బలగాలపై దాడులు జరిపిన ఘటనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.

ముష్కరులను మట్టుబెట్టడం భద్రతాబలగాలకు పెద్ద విజయం అని అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ‘‘చనిపోయిన ఉగ్రవాదులలో ఎల్ఈటీ కమాండర్ ముక్తార్ భట్ ఉన్నారు. అతడు భద్రతాదళాల శిబిరంపై దాడికి ప్రణాళికలు రచించాడు. ఈ ఘటనలో ఏకే74 రైఫిల్, ఒక ఏకే 56 రైఫిల్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు.