
దేశంలోని ప్రముఖ శిర్డీ సాయిబాబా దేవాలయానికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ భద్రత చర్యలు చేపట్టింది. శిర్డీ సాయిబాబా సంస్థాన్కు కేంద్ర భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సంజయ్ కాలే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల తర్వాత కేంద్రం సీఆర్పీఎఫ్ భద్రత కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే శిర్డీ గ్రామస్తులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.
జులై 1 నుంచి ఆలయానికి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్అదనపు భద్రత కల్పించింది. ఇందుకోసం అస్నార్లో 75 మంది జవాన్లు మోహరించారు. వీరు ఆలయ గభారా, ప్రవేశ ద్వారాలకు రక్షణ కల్పించనున్నారు. వీరికి తోడు 100 మంది రాష్ట్ర పోలీసులు అదనపు భద్రత కల్పించనున్నారు.