బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)కి సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటోంది. సల్మాన్ని చంపుతామంటూ ఎప్పుడు ఎవరో ఒకరు బెదిరింపు లేఖలు రాస్తూనే ఉంటారు.
ఇక లేటెస్ట్గా సల్మాన్ ఖాన్కు చెందిన ముంబై సమీపంలోని పన్వేల్లోని ఫామ్ హౌజ్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా బయటికి వచ్చిన ఈ ఘటన జనవరి 4న జరిగింది. ఇవాళ ముంబై పోలీసులు ఫామ్ హౌజ్ నిందితులను అజేష్ కుమార్ ఓంప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్సింగ్ సిఖ్లు గా గుర్తించి అదుపులో తీసుకున్నారు.
అసలు వివరాల్లోకి వెళితే:
అర్పితా ఫామ్హౌజ్లోని అక్కడ ఉన్నసెక్యూరిటీ గార్డులతో నిందితులు మాట్లాడుతూ..మేము సల్మాన్ ఖాన్ అభిమానులమని, చాలా రోజులుగా ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని..ఇలా ఇపుడు వచ్చామని తెలిపారు. అయితే, నిందితులు ఇక్కడ ఎంట్రీ ఇచ్చినపుడు మాత్రం తమ పేర్లను తప్పుగా చెప్పి..ఫేక్ ఐడి కార్డులను ఇద్దరూ సెక్యూరిటీ గార్డులకు చూపెట్టారు.
ఇక వీరిద్దరిని గాడ్స్ లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో..ఫామ్ హౌజ్ గోడలు ఎక్కి, గొడపై ఉన్న ముళ్ల తీగలను కత్తిరించి కాంపౌండ్ లోకి దూకాలని ప్రయత్నించినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.అయితే..అక్కడ ఈ నిందితులు చేస్తోన్న కార్యకలాపాలపై పూర్తిగా అనుమానం రావడంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిపారు. అనంతరం వాళ్ళు నిందితులను తమ ఆధీనంలోకి తీసుకుని..పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదే విషయంపై..ఇన్స్పెక్టర్ అనిల్ పాటిల్ మాట్లాడుతూ..సల్మాన్ ఫామ్ హౌజ్ లో చొరబడిన నిందితులపై పన్వెల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు.
రీసెంట్గా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతనికి Y+ భద్రత కూడా కల్పించారు. అంతేకాకుండా..మార్చి 2023లో ఈ ముఠా నుంచి తరుచు బెదిరింపు ఈమెయిల్స్, లెటర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం పంజాబ్ జైల్లో ఉన్న బిష్ణోయ్ విషయానికి వస్తే.. ఇతను పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాని హత్య చేసిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఫామ్ హౌజ్ లోకి చొరబడిన వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
Maharashtra | A case has been registered at Panvel Rural Police Station against two people for trying to enter Salman Khan's Arpita Farm House in Waze, New Panvel. Further investigation is being done: Anil Patil, Inspector, PS Panvel Taluka
— ANI (@ANI) January 8, 2024
"Two youths from Punjab came to… pic.twitter.com/2vN6XpbLLd