మూడు రోజుల్లో రూ.10 లక్షలు సీజ్

మూడు రోజుల్లో రూ.10 లక్షలు సీజ్
  • వేర్వేరు చోట్ల రూ.10.35 లక్షలు సీజ్

హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు : సిటీలోని వేర్వేరు చోట్ల సోమవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.10.35లక్షలు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.15.68 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. అలాగే 45.56 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకొని, ఆరుగురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎలక్షన్ కమిషన్ టీమ్, దోమలగూడ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద తనిఖీలు నిర్వహించారు. టూవీలర్ పై వెళ్తున్న అస్లాముద్దీన్ అనే వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా రూ.9,30,000 -నగదు బయటపడింది. సరైన డాక్యుమెంట్లు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు దోమలగూడ ఇన్​స్పెక్టర్​శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.