
న్యూఢిల్లీ: నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ఎక్కువ కావడంతో వెండి ధర మంగళవారం (జూన్ 10) కిలోగ్రాముకు రూ.1,000 తగ్గి రూ.1,07,100కి చేరుకుంది. సోమవారం స్థానిక మార్కెట్లలో ఈ లోహం ధర రూ.1,000 పెరిగి కిలోగ్రాముకు రూ.1,08,100 తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.110 తగ్గి రూ.97,670కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర10 గ్రాములకు రూ.100 తగ్గి రూ.97,250కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో, స్పాట్ బంగారం ఔన్సు (28.3 గ్రాములు) ధర స్వల్పంగా పెరిగి 3,329.12 డాలర్లకు చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సు ధర 0.3 శాతం తగ్గి 36.64 డాలర్లకు చేరుకుంది.