కాంగ్రెస్ సీట్లు పెరుగుతయ్..2019 కంటే చాలా ఎక్కువ గెలుచుకుంటం : చిదంబరం

కాంగ్రెస్ సీట్లు పెరుగుతయ్..2019 కంటే చాలా ఎక్కువ గెలుచుకుంటం : చిదంబరం

కోల్​కతా : ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2019 కంటే చాలా ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని చెప్పారు. శనివారం కోల్​కతాలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో హిందూ మతానికి హిందువులకు ఎటువంటి ముప్పు లేదన్నారు. బీజేపీ.. సమా జంలో కొన్ని భయాందోళ నలు కల్పించే ప్రయ త్నం చేస్తున్నదని మండి పడ్డారు.

ఈ ఎన్నికల్లో లాభం పొందడం కోసం ప్రధాని మోదీని ‘‘హిం దువుల రక్షకు డిగా” బీజేపీ గణాలు ప్రచారం చేస్తున్నాయ ని.. మరోవైపు ప్రతిపక్షాలను‘హిందూ వ్యతిరేకులు’గా చిత్రీకరిస్తున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చాలా కీలకంగా మారారని పేర్కొన్నారు. ఆమె చేరికతో ఇండియా కూటమి మరింత బలోపేతం అవుతుందని అన్నారు.