
గచ్చిబౌలి, వెలుగు: సామాజిక న్యాయానికి ప్రతీక ఎస్.ఆర్.శంకరన్ అని, దేశంలోని అత్యున్నత సేవా తపన కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కొనియాడారు.
బుధవారం ఎస్.ఆర్.శంకరన్ జయంతి సందర్భంగా గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలో ఆయన స్టూడెంట్స్తో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శంకరన్ అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక హాస్టల్ వ్యవస్థను ప్రారంభించారని, గురుకుల విద్యకు పునాది వేశారని తెలిపారు. శంకరన్ కన్న కలలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు.