టీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ల డుమ్మా

టీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ల డుమ్మా

టీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ నేతలు డమ్మా కొట్టారు. ఉత్తమ్, జగ్గారెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, శ్రీధర్ బాబు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి,అజారోద్దిన్, ఎమ్మెల్యే పొడెం వీరయ్య,ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చందర్ రెడ్డి హాజరుకాలేదు. ఎమ్మెల్యే సీతక్క భారత్ జోడో యాత్రలో ఉన్నారు.

కాగా ఇప్పటికే సీనియర్ నేతలతో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే  మాట్లాడారు.శిక్షణ తరగతులకు హాజరుకావాలని సూచించారు.అయినా సీనియర్లు హాజరుకాకపోవడం గమనార్హం. ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని.. బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది.