బెంగళూరు: ఇండియా సీనియర్ విమెన్స్ క్రికెటర్, కీపర్ కరుణ జైన్.. ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. బెంగళూరుకు చెందిన కరుణ.. ఇండియా, కర్నాటక, పుదుచ్చెరితో పాటు సౌత్ జోన్కు ఆడింది.
2004 నుంచి 2014 మధ్య కాలంలో ఇండియా తరఫున5 టెస్ట్లు ఆడిన కరుణ 195 రన్స్ చేసింది. 44 వన్డేల్లో 987 రన్స్ సాధించింది. ఇందులో ఓ సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్లో 9 టీ20లు కూడా ఆడింది. కీపర్గా కూడా మెరుగైన ప్రతిభ చూసిన కరుణ.. 2005లో వరల్డ్కప్ ఫైనల్ చేరిన టీమిండియాలో సభ్యురాలు.