ఒకే రోజు కృష్ణా, గోదావరి  బోర్డు మీటింగ్స్

ఒకే రోజు కృష్ణా, గోదావరి  బోర్డు మీటింగ్స్

కృష్ణా, గోదావరి  బోర్డుల సమావేశాలు  ఒకే రోజు  జరగనున్నాయి. సెప్టెంబర్ 1న వేర్వేరుగా మీటింగ్ లు  పెట్టనున్నారు. ఉదయం   11 గంటలకు కేఆర్ఎంబీ  సమావేశం నిర్వహిస్తుండగా... అదే రోజు  సాయంత్రం 4 గంటలకు  గోదావరి బోర్డు  భేటీ జరగనుంది.  కేఆర్ఎంబీ 14వ సమావేశం ఇవాళ నిర్వహించాల్సి ఉండగా... దాన్ని సెప్టెంబర్  ఫస్ట్ కు వాయిదా  వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా బోర్లు  సమావేశంలో  రెండు రాష్ట్రాల  మధ్య జలవివాదాలు, నీటి పంపకాలతో  పాటు  జ్యూరిస్ డిక్షన్  అమలుకు సంబంధించిన  అంశాలను ఎజెండగా చేర్చారు. 

మరోవైపు గోదావరి  బోర్డు సమావేశంలో  జ్యూరిస్ డిక్షన్  అమలుకు  సంబంధించిన క్లాజులపైనే ప్రధానంగా  చర్చించనున్నారు. సమావేశానికి సభ్యులందరూ  హాజరుకావాలని  జీఆర్ఎంబీ మెంబర్  సెక్రటరీ   బీపీ పాండే  లేఖ రాశారు. గెజిట్ లోని   క్లాజుల అమలుపై చర్చిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 3న   నిర్వహించిన కృష్ణా,  గోదావరి బోర్డుల  కోఆర్డినేషన్ మీటింగ్, 9న  నిర్వహించిన కేఆర్ఎంబీ,  జీఆర్ఎంబీ  జాయింట్ మీటింగ్ కు  రాష్ట్ర సర్కార్ డుమ్మా  కొట్టింది. అయితే కేఆర్ఎంబీ  14వ సమావేశానికి  హాజరవ్వాలని అధికారులను ఆదేశించారు  సీఎం కేసీఆర్.