ఛత్తీస్ గఢ్ లో కాల్పుల మోత.. ఏడుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్ గఢ్ లో కాల్పుల మోత.. ఏడుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ దళాల కూంబింగ్ టైంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఫైరింగ్ లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు ఛత్తీస్ గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. రజ్ నందన్ గావ్ జిల్లా సితాగొటా అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు డీజీపీ. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ దళాలు ఇటీవలి కాలంలో మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నాయి. ఈ డీఆర్ జీ దళంలో మహిళలు కూడా ఉన్నారు. మాజీ మహిళా మావోయిస్టులు కొందరిని ఈ దళంలో చేర్చుకుని ట్రైనింగ్ ఇచ్చారు.