కవితను ఓడగొట్టింది ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే : జీవన్ రెడ్డి

కవితను ఓడగొట్టింది ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే : జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు: మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితను ఓడగొట్టింది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  అన్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంధిరా భవన్ లో ఆమె  చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో కవిత గెలిస్తే తమపై ఆధిపత్యం చెలాయిస్తుందన్న ఉద్దేశంతో  ఏడుగురు ఎమ్మెల్యేలు  కలిసి కుట్రపూరితంగా కవితను ఓడించారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు 30 నుంచి 60 వేల మెజారిటీ వచ్చిందని, ఎంపీగా పోటీ చేసిన కవితకు ఆ ఓట్లు ఎటు పోయాయని ఆయన ప్రశ్నించారు. రైతులతో నామినేషన్ వేసి కవితను కాంగ్రెస్ పార్టీ ఓడించింది నిజమైతే ఆ రైతు సంఘ లీడర్లు కాంగ్రెస్ లోకి కాకుండా బీజేపీ కండువా ఎందుకు కప్పుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. ముమ్మాటికి కవిత ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని కోరుకుంటామని తెలిపారు.