ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

ఘనంగా  ఫూలే జయంతి వేడుకలు

హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మహాత్మా జ్యోతిరావు పూలే 196 జయంతి సందర్భంగా అంబర్పేటలోని అలీ కేఫ్ వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మార్పీఎస్ జాతీయ కన్వీనర్ మంద కృష్ణ మాదిగ, కాంగ్రెస్ నాయకుడు అంజనీకుమార్ యాదవ్, బీసీ నాయకుడు గాజుల శ్రీనివాస్ తదితరులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ఫూలే కృషి చేశారన్నారు. పూలే ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు.

మరిన్ని వార్తల కోసం:

ట్విట్టర్​ నుంచి ఎడిట్​ ఫీచర్​

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు