రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నూతన జాతీయ విద్యా విధానంపై రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ ఐ నేతలు ఇవాళ రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు. అంతేగాకుండా ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల జోక్యం తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే విభజన హామీలను నెరవేర్చాలని రాజ్ భవన్ ను ముట్టడించారు ఎస్ఎఫ్ ఐ నేతలు