ప్రధాని మోదీపై షారూఖ్ ప్రశంసల జల్లు.. జీ20 సమ్మిట్ విజయవంతం చేశారని కితాబు

ప్రధాని మోదీపై షారూఖ్ ప్రశంసల జల్లు.. జీ20 సమ్మిట్ విజయవంతం చేశారని కితాబు

జీ20 సమ్మిట్ ను విజయవంతం చేసినందుకు, ప్రపంచ భవిష్యత్తు కోసం దేశాల మధ్య ఐక్యతను పెంపొందించిన ప్రధాని నరేంద్ర మోదీని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఆయన తన మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ X (గతంలో ట్విటర్) లో ట్వీట్ చేశారు. 

జీ20 సమ్మిట్ ప్రతి భారతీయుడి హృదయాలలో గౌరవం, గర్వాన్ని నింపిందన్నారు. మోదీ నాయకత్వంలో మేము ఒంటరిగా కాకుండా ఐకమత్యంతో అభివృద్ధి చెందుతామని చెప్పారు. ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అంటూ రాసుకొచ్చారు.