
అడిలైడ్: ఫస్ట్ టెస్ట్లో దారుణ ఓటమి మూటగట్టుకున్న టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుండగా గాయపడిన పేసర్ మహ్మద్ షమీ.. సిరీస్లో మిగిలిన మూడు టెస్ట్లకు దూరం కానున్నాడు. షమీ చేతికి ఫ్రాక్చర్ అయినట్టు అతనికి చేసిన స్కానింగ్లో తేలింది. దీంతో షమీ.. ఆసీస్ టూర్ ముగిసినట్టే. కమిన్స్ వేసిన షార్ట్ బాల్.. షమీ కుడి చేతి మణికట్టుకి బలంగా తాకింది. దీంతో బ్యాట్ కూడా ఎత్తలేకపోయిన పేసర్.. మరో దారిలేక రిటైర్డ్ నాటౌట్గా గ్రౌండ్ను వీడాడు. టీమ్ మెడికల్ స్టాఫ్ షమీని హాస్పిటల్కు తరలించి స్కాన్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ‘ ఏం జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. షమీకి ఫ్రాక్చర్ అయ్యింది. దాని వల్లే అతను బ్యాట్ను సరిగ్గా పట్టుకోలేకపోయాడు’ అని జట్టు వర్గాలు వెల్లడించాయి. షమీ పరిస్థితిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ సీనియర్ పేసర్ వైదొలిగితే అతని ప్లేస్లో టీమ్లోకి రానున్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ టెస్టు అరంగేట్రం చేసే చాన్సుంది.
For More News..