హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో బ్రాండ్పారాచూట్ షాంపూల విభాగంలోకి వచ్చింది. అడ్వాన్స్డ్ ప్రోటీన్ షాంపూ ద్వారా హిందుస్థాన్ యూనిలీవర్ , ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వంటి ఎంఎన్సీలతో పోటీ పడనుంది.
ఏటా 10 శాతం వృద్ధి చెందుతున్న రూ.10 వేల కోట్ల షాంపూ మార్కెట్లో భారీ వాటాను దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని సాధించాలనే వ్యూహంలో ఇదొక భాగమని మారికో తెలిపింది.
