శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇండిగో విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 785 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.47.49 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ బంగారాన్ని ప్రయాణికుడు లోదుస్తువుల్లో దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. అతడిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.