
- క్యాబ్ డ్రైవర్లకు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
శంషాబాద్, వెలుగు: పోలీస్ వాహనాల ఫాస్ట్ ట్యాగ్లు చోరీ చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓల్డ్ సిటీలోని యాకత్ పురకు చెందిన నిస్సార్ అహ్మద్(30) ప్రైవేట్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయ్యి ట్రైనింగ్ లో ఉన్నాడు. తన ఫ్రెండ్తో కలిసి పోలీస్ వాహనాలకు సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్లు దొంగిలించి, విమానాశ్రయం వద్ద క్యాబ్ డ్రైవర్లకు విక్రయిస్తున్నాడు. ఒక్కో ఫాస్ట్ ట్యాగ్కు నెలకు రూ.10 వేల చొప్పున తీసుకుంటున్నాడు.
ఇలా ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డులో నడుస్తున్న మూడు క్యాబ్ లను పోలీసులు సీజ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ బాలరాజ్ తెలిపారు.