- కేసు నమోదు చేసిన పోలీసులు
- ‘ఖాలీ మెంటల్ ఉంటది.. సూడుర్రి మీరే’ అంటూ చేతిలో గంజాయితో వీడియో
- వైరల్ కావడంతో స్పందించిన సీపీ సజ్జనార్
- నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్
హైదరాబాద్సిటీ/ఓల్డ్సిటీ, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా శంషాబాద్ ధర్మగిరి దేవాలయంలో శివుడికి కొందరు ఆకతాయిలు గంజాయి ప్రసాదంగా పెట్టారు. పైగా వారు చేసే పనిని వీడియో తీసి ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారి.. సీపీ సజ్జనార్దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్మీడియా వేదికగా స్పందించారు. నిందితులను పట్టుకుని, శిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు. అనంతరం నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు సభావత్ శ్రీచరణ్(21), వరైవత్విజయ్కృష్ణ(19)ను పట్టుకొని ఫలక్నుమా పోలీస్స్టేషన్లో అప్పగించారు.
ఏం జరిగిందంటే..
మహాశివరాత్రి సందర్భంగా శంషాబాద్ ధర్మగిరి దేవాలయానికి భక్తులు తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి పండ్లు, పాలు ప్రసాదంగా సమర్పిస్తున్నారు. అక్కడికి జంగమ్మెట్కు చెందిన సభావత్ శ్రీచరణ్, వరైవత్ విజయ్కృష్ణ వచ్చారు. ‘సో.. గయ్స్శివునికి ఒక ప్రసాదం పెట్టనీకే వచ్చినం. మనం ఏ ప్రసాదం పెడుతున్నా.. ఖాలీ మెంటల్ ఉంటది.. సూడుర్రి మీరే. అందరూ కొబ్బరికాయలు, గిబ్బరికాయలు కొట్టనీకే వస్తరు. మనం గిట్ల కాదు. శివునికి ఫేవరెట్ఉండాలె’ అంటూ చేతిలో గంజాయి చూపించారు. తర్వాత గంజాయిని దేవుడి ముందు పెట్టి వీడియో తీశారు. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేయగా వైరలయ్యింది. కాగా, ఈ వీడియో విషయం కాస్తా హైదరాబాద్ సీపీ సజ్జనార్దృష్టికి వెళ్లడంతో ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? ఏదో సాహసం చేశామని అనుకుంటున్నారా? ఈ చర్యలను ఉపేక్షించబోం. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు.
