చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. మార్చి 15న సినిమా విడుదల కానుంది. తాజాగా ఆదివారం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కట్టినట్టు ఇందులో చూపించారు. ఈజీ మనీ కోసం రకరకాల స్కీమ్ల్లో జాయిన్ అవుతూ జీవితాలను ఎలా పాడుచేసుకుంటున్నారనే పాయింట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు.
చిరంజీవి, విజయశాంతి పాత్రల్లో చైతన్యరావు, భూమిశెట్టి నటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో చైతన్య రావు మాట్లాడుతూ ‘మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది’ అని చెప్పాడు. ఇదొక న్యూ ఏజ్ సినిమా అని, అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పింది భూమిశెట్టి. కరీంనగర్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు కుమారస్వామి చెప్పాడు. మంచి సినిమాతో తమ సంస్థ లాంచ్ అవడం హ్యాపీగా ఉందని నిర్మాతలు అన్నారు.