యువతకు న్యాయం చేయాలనే షర్మిల పోరాటం..: గద్దర్​

యువతకు న్యాయం చేయాలనే షర్మిల పోరాటం..: గద్దర్​

హైదరాబాద్: వైఎస్​ఆర్​టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అని రచయిత గద్దర్​పేర్కొన్నారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రభుత్వంపై షర్మిల పోరాడుతోందని అన్నారు. అప్పులు చేసి కోచింగ్​లు తీసుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల ఆత్మరక్షణ కోసం పోలీసులతో అలా ప్రవర్తించారని తెలిపారు. తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటం..

"ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేయాలి. ఎన్నికల యుద్ధానికి ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది.  డబ్బుతోనే సీఎం కేసీఆర్​ మళ్లీ అధికారంలోకి రావాడానికి నిర్ణయించుకున్నారు. ఉద్యమమప్పడు కేసీఆర్​ దగ్గర డబ్బులు లేవు. ఇప్పడు ఉన్నాయి. మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి. యువత రాజకీయ శక్తిగా మారితేనే మార్పు సాధ్యమవుతుంది. షర్మిల అలా మారినందుకే ఆమె పోరాటాలను అణిచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప కష్టాలు తీరలేవు. కేసీఆర్​కి ఇవే చివరి ఎన్నికలు.

ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సచివాలయం, అసెంబ్లీని విద్యార్థులు చుట్టు ముట్టాలి." అని గద్దర్​ పిలుపునిచ్చారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్న నిరాహార దీక్షలో షర్మిల, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. "సర్కార్ కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట" అనే నినాదంతో ఈ దీక్ష చేపట్టారు.