MLC 2025: 238 పరుగుల టార్గెట్ ఖతం: చివరి బంతికి 6 పరుగులు.. సిక్సర్‌తో మ్యాచ్ గెలిపించిన హెట్మెయర్

MLC 2025: 238 పరుగుల టార్గెట్ ఖతం: చివరి బంతికి 6 పరుగులు.. సిక్సర్‌తో మ్యాచ్ గెలిపించిన హెట్మెయర్

మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా శనివారం (జూన్ 28) థ్రిల్లింగ్ మ్యాచ్ చోటు చేసుకుంది. డల్లాస్ వేదికగా గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో ఎంఐ న్యూయార్క్ పై సియాటిల్ ఓర్కాస్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. సియాటిల్ ఫినిషర్ హెట్మెయర్(40 బంతుల్లో 97: 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో ఓర్కాస్ జట్టును గెలిపించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో 9 పరుగులు చేయాల్సిన దశలో హై డ్రామా చోటు చేసుకుంది. పొలార్డ్ వేసిన తొలి 5 బంతులకు కేవలం 3 పెరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి రెండు బంతులు డాట్ బాల్స్ వేయగా.. మూడో బంతికి సింగిల్ వచ్చింది. దీంతో చివరి 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. 

నాలుగో బంతిని కూడా డాట్ వేయడంతో ఉత్కంఠ ఆకాశాన్ని చేరుకుంది. చివరి 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో హెట్మెయర్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 6 పరుగులు అవసరమైన దశలో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఈ విండీస్ వీరుడు సిక్సర్ కొట్టడంతో సియాటిల్ ఓర్కాస్ సంచలన విజయాన్ని అందుకుంది. 238 పరుగుల లక్ష్యం కాళ్ళ ముందు కనిపిస్తున్నా ఆర్కాస్ జట్టు తడబడలేదు. మేయర్స్ (37), రజా (30), క్లాసన్ (26) ఉన్నత సేపు వేగంగా ఆడితే హెట్మెయర్ చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ను గెలిపించాడు. 

►ALSO READ | సూర్యవంశీ ధనాధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సింగ్స్.. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై భారత్ ఘన విజయం

వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడిపోయిన సియాటిల్ ఓర్కాస్ కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు భారీ స్కోర్ చేసింది. పూరన్ (60 బంతుల్లో 108: 7 ఫోర్లు, 8 సిక్సర్లు)   సెంచరీతో చెలరేగితే తజిందర్ ధిల్లాన్(35 బంతుల్లో 95: 8 ఫోర్లు, 8 సిక్సర్లు)  అంతకు మించిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో సియాటిల్ ఓర్కాస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసి చివరి బంతికి గెలిచింది. హెట్మెయర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.