'ఆదిపురుష్'కు షాక్.. పెద్ద సంఖ్యలో టికెట్లు క్యాన్సిల్

'ఆదిపురుష్'కు షాక్.. పెద్ద సంఖ్యలో టికెట్లు క్యాన్సిల్

ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న విడులైన విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు ఈ సినిమాపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. రామాయణాన్ని తప్పుగా చూపించారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో పాత్రలను తీర్చి దిద్దారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ మూవీకి ముందే నుంచే భారీ హైప్ క్రియేట్ చేయడంతో చాలా మంది ఫస్ట్ షో, ఫస్ట్ డేనే చూడాలని ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారు. అందరూ చూడదగ్గ ఫిల్మ్ కావడంతో మరి కొంత మంది ఫ్యామిలీతో వెళ్లి చూసేలా ప్లాన్ వేసుకున్నారు. కానీ ఈ సినిమాకు వస్తోన్న ట్రోల్స్, టాక్ ను చూసి వారు సినిమా చూడొద్దని భావిస్తున్నారట. తమ బుక్ చేసుకున్న టికెట్స్ ను కూడా కాన్సిల్ చేసుకుంటున్నారట.

ఇదే విషయాన్ని కొంతమంది సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తప్పుగా చిత్రీకరించిన రామాయణాన్ని చూడలనుకోవడం లేదు.. అందుకే ఆది పురుష్ సినిమా టికెట్స్ ను కాన్సిల్ చేశాను అని ఒక యూజర్ తెలిపారు. నేను నా కూతురికి రామాయణాన్ని తప్పుగా చూపించాలని అనుకోవడం లేదు. అందుకే ఆది పురుష్ మూవీ టికెట్స్ ను కాన్సిల్ చేశానంటూ ఇంకొకరు రాసుకొచ్చారు. భారత ఇతిహాసమైన రామాయణాన్ని అపహాస్యం చేశారు. ఆది పురుష్ రామాయణం కాదు అని మరొకరు ఆరోపిస్తూ పోస్ట్ లో పేర్కొన్నారు.

https://twitter.com/kartikpujari01/status/1669758190882529282

భారీ అంచనాలతో తెరకెక్కిన ఆది పురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించారు. VFX, ఇతర కారణాల రీత్యా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైంది.

https://twitter.com/Nezz_gg/status/1669997674500861953