కన్నప్ప రిలీజ్కు ముందు మంచు విష్ణుకు షాక్.. మాదాపూర్ ఆఫీస్లో ఐటీ, జీఎస్టీ సోదాలు !

కన్నప్ప రిలీజ్కు ముందు మంచు విష్ణుకు షాక్.. మాదాపూర్ ఆఫీస్లో ఐటీ, జీఎస్టీ సోదాలు !

భారీ బడ్జెట్ తో.. ఇండియాలోని దాదాపు అన్ని సినీ పరిశ్రమల టాప్ యాక్టర్స్ తో తెరకెక్కిస్తున్న మూవీ కన్నప్ప. మంచు విష్ణు లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాను జులై 27న రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు ఐటీ (ఇన్కం ట్యాక్స్) అధికారులు మంచు విష్ణు ఆఫీస్ లో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. 

బుధవారం (జూన్ 25) హైదరాబాద్ మాదాపూర్ కాకతీయ హిల్స్ లోని మంచు విష్ణు కార్యాలయం (24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ )  ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు బృందాలతో తనిఖీ చేస్తున్నారు. కన్నప్ప సినిమా బడ్జెట్ గురించి ఆరా తీస్తున్నారు. ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

సినిమా బడ్జెట్ కు సంబంధించిన ఖర్చులు, బ్యాలన్ షీట్లను పరిశీలిస్తున్నారు. ఏ ఏ అకౌంట్ల నుంచి నిధులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. ట్యాక్స్, జీఎస్టీ ఎంత వరకు చెల్లించారనే కోణంలో సోదాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు హుటాహుటిన విష్ణు ఆఫీస్ కు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఐటీ, జీఎస్టీ రైడ్స్ గురించి తనకు తెలియదని.. సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు మంచు విష్ణు తెలిపారు. 

►ALSO READ | Kuberaa: కలెక్షన్లు కుమ్మేస్తున్న ‘కుబేర’.. తొలిసారి రూ.100 కోట్ల క్లబ్లోకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా రూపొందిన  చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్  లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న పాన్ ఇండియా వైడ్‌‌గా  సినిమా విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను కూడా నిర్వహించారు. సరిగ్గా రిలీజ్ కు ముందు సోదాలు నిర్వహించడం సినిమా యూనిట్, అభిమానుల్లో ఆందోళన కలిగించే అంశం.