ఒకే ఇంట్లో ముగ్గురికి షాక్.. ఒకరి మృతి

ఒకే ఇంట్లో ముగ్గురికి షాక్.. ఒకరి మృతి

హసన్ పర్తి, వెలుగు: కరెంట్​షాక్ తగిలిన భర్తను కాపాడబోయి హనుమకొండ జిల్లాలో భార్య మృతి చెందింది. సీఐ శ్రీధర్​రావు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ పర్తి మండలం సీతానగరం గ్రామానికి చెందిన ముప్పా కుమారస్వామి, లత(39) భార్యాభర్తలు. దీపావళి పండుగ సందర్భంగా లత బుధవారం ఇంట్లోని బట్టలన్నీ ఉతికింది. ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు వద్ద ఆరేస్తుండగా కుమారస్వామికి కరెంట్​షాక్​కొట్టింది. పక్కనే ఉన్న భార్య లత భర్తను కాపాడేందుకు ప్రయత్నించగా ఆమెకు కూడా షాక్​తగిలింది. వారి అరుపులు విన్న కొడుకు సాయి అక్కడికి వెళ్లి తల్లిదండ్రులను తప్పించే ప్రయత్నం చేయగా అతను కూడా షాక్​కు గురయ్యాడు. ఇంటి పక్కవారు గమనించి ట్రాన్స్​ఫార్మర్​నుంచి కరెంట్​బంద్ చేయించారు. వెంటనే ముగ్గురిని హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ లత మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.