
మరికల్, వెలుగు: కోడలు వేధింపులు భరించలేక అత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం గాజులయతాండలో జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. తాండాకు చెందిన సకీరమ్మ(67)కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు గేసునాయక్ దగ్గర సకీరమ్మ ఉంటోంది. కొన్ని రోజులుగా కోడలు జయమ్మ, మనువడు జైపాల్నాయక్ సకీరమ్మను వేధిస్తున్నారు. సోమవారం రాత్రి అత్తపై కోడలు దాడి చేయడంతో, వేధింపులు భరించలేక మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి పెద్ద కొడుకు రాంసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.