అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

వాషింగ్టన్: అమెరికాలో మరో సారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరణించిన వారిలో  షూటర్ కూడా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నార్త్ పోర్ట్ లాండ్ కు18 మైళ్ల దూరంలో ఓచార్డ్స్ లోని ఓ ఇంటిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంట్లోని వారికి హానిని తలపెడతామంటూ ఓ కుటుంబ సభ్యుడికి ఆగంతకుడి నుంచి టెక్ట్స్ మెసేజ్ వచ్చింది.

దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమయిన పోలీసులు స్వ్కాడ్, మెడికల్ సిబ్బందిని తీసుకుని వారి ఇంటికి వెళ్లారు. డ్రోన్ సహాయంతో ఇంట్లోకి తొంగి చూడగా కుటుంబ  సభ్యులు అప్పటికే రక్తపు మడుగులో పడి కనిపించారు.