సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా?

సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ వస్తుంటే జనం వణికిపోవాలా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ జనగాం పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సీఎం పర్యటన పేరుతో సామాన్య జనానికి తీవ్రమైన ఇబ్బందులు కలుగజేస్తున్నారని ఆరోపించారు. అసలు కేసీఆర్ ఎలాంటి తప్పు చేయకుంటే అరెస్టులకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ఈ అరెస్టులు, దాడులు చూస్తుంటే ... మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిపోవడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

బీజేపీకి జోష్.. పార్టీలో చేరిన  WWE  ద గ్రేట్ ఖలీ

లఖింపూర్ ఖేరి కేసు: కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్