హైదరాబాద్, వెలుగు: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో పాల్గొనే తెలుగు టాలన్స్ కెప్టెన్గా శుభమ్ షియోరాన్ను ఎంపిక చేసినట్టు టీమ్ ఓనర్ అభిషేక్ రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 8 నుంచి జైపూర్లో జరిగే మెగా టోర్నీలో బరిలోకి దిగే టాలన్స్ టీమ్ జెర్సీని సోమవారం జెన్టీఎయూలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కె. నరసింహా రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జట్టు కెప్టెన్, స్పాన్సర్లను కూడా ప్రకటించారు. టీమ్, స్పాన్సర్లతో ఈ సీజన్లో ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని అభిషేక్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల తరపున లీగ్లో ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగు టాలన్స్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోందని తెలిపారు.