ఒడెన్స్:ఇండియా సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మ్యాచ్లో సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో పోరాడి ఓడింది.
మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్యసేన్ 21–16, 21–12తో ఆరో సీడ్ గింటింగ్ (ఇండోనేసియా) కు షాకిచ్చి రెండో రౌండ్ చేరాడు. మరో మ్యాచ్లో హెచ్ ఎస్ ప్రణయ్ 21–13, 22–20తో జవొ జున్ పెంగ్ (చైనా)పై నెగ్గాడు. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–15, 21–19తో మిన్ హ్యుక్–సెయుంగ్ జయె (కొరియా) జంటను ఓడించి ముందంజ వేసింది.