ఎస్ఐ, కానిస్టేబుల్​ మెయిన్స్ ఎగ్జామ్స్ మార్చి 12 నుంచి

ఎస్ఐ, కానిస్టేబుల్​ మెయిన్స్ ఎగ్జామ్స్ మార్చి 12 నుంచి

హైదరాబాద్‌‌, వెలుగు : ఎస్​ఐ, కానిస్టేబుల్‌‌ మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌బీ) ఆదివారం ప్రకటించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్‌‌ 23 దాకా ఫైనల్ ఎగ్జామ్స్‌‌ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌‌ను బోర్డు చైర్మన్​ వీవీ శ్రీనివాస్‌‌ రిలీజ్​ చేశారు. పోయిన నెల 8న ప్రారంభమైన ఫిజికల్​ టెస్ట్​లు ఈ నెల 5తో ముగియనున్నట్టు ప్రకటించారు. 

ఈవెంట్స్‌‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్​ ఎగ్జామ్​కు రెడీ కావాలని సూచించారు. టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌బీ వెబ్‌‌సైట్‌‌లో పూర్తి వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. ప్రతీ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా, మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల దాకా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.