సిద్దిపేటకు జాతీయ అవార్డు

సిద్దిపేటకు జాతీయ అవార్డు
  • పిల్లలకు 100% వ్యాక్సినేషన్​ కంప్లీట్​ చేసిన  జిల్లాగా రికార్డు
  • 2019 సంవత్సరానికి ప్రైమ్​ మినిస్టర్​ అవార్డుకు ఎంపిక

సిద్దిపేట, వెలుగు: చిన్నారులకు వంద శాతం వ్యాక్సినేషన్ ఇచ్చిన జిల్లాగా సిద్దిపేట నిలిచింది. మిషన్  ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులో సిద్దిపేట జిల్లా టార్గెట్​ను పూర్తి చేసినందుకు 2019 సంవత్సరానికి గాను ప్రైమ్​ మినిస్టర్​ అవార్డుకు ఎంపికైంది. వివిధ కారణాలతో వ్యాక్సిన్లు వేసుకోలేని చిన్నారులను గుర్తించి, అందరికీ టీకాలు వేయడంలో జిల్లా అధికారులు, సిబ్బంది  సక్సెస్​ అయ్యారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్ర ధనుష్ కేటగిరీలో జిల్లాను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 20, 21తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘సివిల్ సర్వీసెస్ డే’లో రూ.10 లక్షల క్యాష్​ ప్రైజ్​తో పాటు అవార్డు అందజేయనుంది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.  అవార్డు రావడానికి  కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.