సిద్దిపేట బంద్ సంపూర్ణం

సిద్దిపేట బంద్ సంపూర్ణం

సిద్దిపేట, వెలుగు: గోరక్షకులపై దాడికి నిరసనగా విశ్వ హిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సిద్దిపేట బంద్ విజయవంతమైంది. మంగళవారం ఉదయం నుంచే వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు బైక్ లపై తిరుగుతూ వ్యాపార సంస్థలను మూసి వేయించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

పట్టణంలో వాణిజ్య వర్తక సంస్థలను మూసివేసినా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు యధావిధిగి పనిచేశాయి. పట్టణంలోని మెయిన్ రోడ్డు, సుభాష్​రోడ్డు, లాల్ కమాన్, కాంచిట్ చౌరస్తా, గాంధీ చౌక్ లలోని వర్తక సంఘాలు బంద్ కు సంపూర్ణంగా మద్దతును తెలిపాయి. పట్టణంలోని పలు వీధులు నిర్మానుష్యంగా మారగా వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు బైక్ లపై తిరుగుతూ గో రక్షకులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.