సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. సీఎస్ ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. హైదారాబాద్ లోని బీఆర్కే భవన్ దగ్గర మాట్లాడిన వెంకటరామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి, సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేశానని.. సీఎస్ ఆమోదించారని చెప్పారు. 26 సంవత్సరాలు అన్ని ప్రభుత్వాల్లో పనిచేశానన్నారు. వెంకటరామిరెడ్డి త్వరలో టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వరి విత్తనాలు అమ్మితే జైలుకు పంపిస్తానంటూ వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. గతంలో కేసీఆర్ పాదాలకు కూడా నమస్కరించి వివాదాస్పదంగా మారారు.
వెంకట్రామిరెడ్డి న్యాయవాదిగా పనిచేశారు. 1996 లో గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ తీసుకున్నారు. బందర్, చిత్తూరు ,తిరుపతి ఆర్డీవోగా పనిచేశారు. మెదక్ పీడీ డ్వామాలో డైరెక్టర్ గా పనిచేశారు. హర్యానా అర్బన్ డెవ్ లప్ మెంట్ అథారిటీ సెక్రటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా మెదక్ జాయింట్ కలెక్టర్ గా ,సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్ గా పనిచేశారు. కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా ఏడు సంవత్సరాల అనుభవం ఉంది.