పంజాబ్ ఎన్నికల ప్రచారంలో సిద్ధూ కూతురు రబియా

 పంజాబ్ ఎన్నికల ప్రచారంలో సిద్ధూ కూతురు రబియా

పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలతో సతమతమౌతోంది. సీఎం చరణ్ జిత్ చన్నీ, పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, సిద్ధూ కుమార్తె రబియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తండ్రికి మద్దతుగా అమృత్ సర్ (తూర్పు) నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రి సిద్ధూ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం 14 ఏళ్లు శ్రమించారని.. పంజాబ్ ను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.

మరోవైపు... పంజాబ్ సీఎం అభ్యర్థి చన్నీ అవినీతిపరుడని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే, ఇవాళ అతడి బ్యాంకు ఖాతాలో రూ.133 కోట్లు ఎలా వచ్చాయని రబియా ప్రశ్నించారు. ఆయన ఖాతాను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి భారీ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఒత్తిళ్ల కారణంగా చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటుందని.. కానీ నిజాయతీ పరుడైన సిద్ధూ ను  ఎంతోకాలం అడ్డుకోలేరని రబియా వ్యాఖ్యానించారు.  అమృత్ సర్ (తూర్పు) నియోజకవర్గంలో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి