ఆషాఢ అమావాస్య ... పితృ దేవతలు భూమిపై సంచరించే రోజు.. ఇలా చేయండి.. అనుగ్రహిస్తారు..

ఆషాఢ అమావాస్య ...  పితృ దేవతలు భూమిపై సంచరించే రోజు..  ఇలా చేయండి.. అనుగ్రహిస్తారు..

Ashadha Amavasya 2025: హిందూ పురాణాల ప్రకారం.. అనేక పండుగలు ఉన్నాయి. పండుగల రోజుల్లో దేవాలయాలు.. గుళ్లు.. గోపురాలు సందర్శిస్తారు.  అలానే మరణించిన వారికి కూడా ఏడాదిలో ఒకరోజు పండుగ ఉంటుందని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది.  ఆషాఢమాసం అమావాస్య రోజు పితృ దేవతలు భూమిపై సంచరిస్తారట.. వారి వంశీకుల బాగోగులు చూసి.. వారు పెట్టిన ఆహారాన్ని తీసుకొని వెళ్తారని పండితులు చెబుతున్నారు.  ఆషాఢ మాసం అమావాస్యరోజు పితృ దేవతలను ఎలా పూజించాలి..   పితృ దేవతల అనుగ్రహం పొందాలంటే ఆరోజు ఏం చేయాలో తెలుసుకుందాం. .  .

  ఆషాఢ అమావాస్యను భీమ అమావాస్య అని కూడా అంటారు. ఆషాఢ అమావాస్య అమావాస్య ఎంతో పవర్ ఫుల్ అని చెబుతారు పండితులు.  ఈ ఏడాది  ఆషాఢ అమావాస్య  జులై 24 న వచ్చింది. ఆరోజు  పితృ దేవతలు భూమిపై సంచరిస్తారని పండితులు చెబుతున్నారు.  

ఆషాఢ అమావాస్య  ప్రాముఖ్యత 

హిందూ మతగ్రంధాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృ తర్పణాలిస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఆ రోజు ( జులై 24)  పవిత్ర స్థలాలను సందర్శించి..నదీ స్నానం ఆచరించి పిండప్రదానాలు చేస్తారు.   పెద్దల పేరుతో  చేసే దాన , ధర్మాల వల్ల వారికి పితృదేవతల శాపాల నుంచి విముక్తి లభించి.. మోక్షం పొందుతారని పండితులు చెబుతున్నారు.  

Also Read:-రాముడి నడియాడిన నేలపై చిలిపి కృష్ణులే ఎక్కువ: ఏకపత్నీ వత్రులు అసలే కాదు.. సర్వే రిపోర్ట్ మైండ్ బ్లోయింగ్

ఆషాఢ అమావాస్య రోజు( జులై 24) ఏం చేయాలి?

  • ఆషాఢ అమావాస్య ( జులై 24)   పవిత్ర నదుల్లో స్నానమాచరించాలి. 
  •  పితృపూజ చేసి, తర్పణాలు విడిచిపెట్టి..అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం (స్వయంపాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు...), వస్త్రదానం చేయాలి. 
  •  పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీశ్సులు మీపై ఉంటాయి. 
  •  జాతకంలో పితృదోషం ఉండేవారు..ఈ రోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కరించి... ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూలచెట్టుకింద ఆవనూనెతో దీపం వెలిగించాలి.  

ఆషాఢ అమావాస్య పూజా ఇలా చేసుకోండి

  • ఆషాఢ అమావాస్య రోజు..ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి.
  • దానిపై శివపార్వతుల ఫొటో పెట్టి పూజ చేయండి.
  • పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం...పార్వతీ దేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజకోసం వినియోగించవచ్చు. 
  • అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టుపెట్టి అందించండి. 
  • ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటారు పండితులు.

 
ఆషాఢ అమావాస్య రోజు ఇవి వద్దు

  • నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు
  • లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు 
  • నూతన వ్యాపారం, ఉద్యోగం..నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు
  • నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు
  • కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి..దాన ధర్మాలు మాత్రమే చేయాలి.