ఆధ్యాత్మికం : ధ్యానం ఎంతసేపు చేయాలి.. ఎలా చేయాలి..

ఆధ్యాత్మికం : ధ్యానం ఎంతసేపు చేయాలి.. ఎలా చేయాలి..

ధ్యానం విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతారు.  ఎవరు ఎంత సేపు చేయాలి. ధ్యానం ఎందుకు చేయాలి.. ధ్యానం చేస్తే కలిగే ఉపయోగాలు ఏమిటి మొదలైన అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

ధ్యానం గురించి చాలమంది  చాలా రకాలుగా చెబుతారు.  ధ్యానం ఎంతసేపు చెయ్యాలి అంటే  మనకు ఆలోచనలు రాకుండా.. మానసికంగా శక్తి వచ్చే వరకు అని ధ్యాన నిపుణులు చెబుతున్నారు.  అంటే నూతన అనుభవాలు పొందేవరకూ అని పండితులు చెబుతున్నారు

మనం నిత్యం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాము.. ఆ ఆలోచనలన్నీ సమసి పోయినతరువాత  మానసికంగా శక్తి వస్తుంది.  ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఒక్క జన్మతో కూడా వచ్చేది కాదని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అందుకే వాడికేంట్రా.. పూర్వజన్మసుక్రుతం అంటారు.  అంటే గత జన్మలో ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని ఈ జన్మలో ఉపయోగించుకుంటున్నాడని అర్దం చేసుకోవచ్చు.   

ధ్యానం అనేది వారి వారి వయస్సు, వారి వారి పరిస్థితులపై ఆధారపడి వుంటాయి. వయస్సుతో పాటే ఆలోచనలూ పెరుగుతూ వస్తాయి. అలాగే ఆ వయసు ఇంకా ఇంకా పెరిగేకొద్దీ ఆ ఆలోచనలూ తగ్గుతూ వస్తాయి. కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు వయస్సు ఎక్కువగా ఉన్నపుడు ధ్యాన సమయాన్ని కూడా ఎక్కువ చేయాలి. ఎంతసేపు ధ్యానం చెయ్యాలి? అన్న ప్రశ్నకు చక్కటి ఫార్ములా వుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తికి 50 సంవత్సరాలుంటే  ఆ వ్యక్తి కనీసం 50 నిమిషాలు సేపు ధ్యానం చెయ్యాలి. అప్పుడే ఆ వ్యక్తి కనీసం 5 నిమిషాలన్నా ఆలోచనా రహిత స్థితిలో వుండగలడు. అంటే యాభై నిమిషాల ధ్యానంలో మనసు అటు ఇటు పరిగెత్తుతూ ఏదో ఒక సందర్భంలో మాత్రమే కనీస మొత్తం మీద అయిదు నిమిషాల సేపు ఎలాంటి ఆలోచనా లేకుండా నిశ్చలత్వాన్ని పొందగలుగుతాడు.  అంటే ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. రుషులు.. పీఠాధిపతులు .. ఇంకా ఎక్కువ సమయం ధ్యానంలోనే గడుపుతారు కదా..!

10 సంవత్సరాల  వయస్సువారు కనీసం 10 నిమిషాలూ... 20 ఏళ్ల వయస్సు వున్నవారు కనీసం 20 నిమిషాలూ ....30 ఏళ్లు వారు 30 నిమిషాలూ... ఈ విధంగా అందరూ ఎవరి వయస్సును బట్టి వారి ధ్యానసాధనను కొనసాగించాలని పండితులు చెబుతున్నారు.

మానవ దేహంలో...   భౌతిక శరీరం ...  మానసిక శరీరం రెండే కలసి ఉంటాయి.  అలాగే అనుభూతి శరీరం....  ఆధ్యాత్మిక శరీరంతో కలిసి ఉంటాయి  .  పండితులు చెప్పిన వివరాల ప్రకారం  ఒక మనిషి ఆధ్యాత్మిక పరంగా ఎదగాలంటే  అనుభూతి శరీరాన్ని ఉపయోగించాలి..మానవుడు మానసిక శరీరంతో పనిచేస్తున్నాడు ..కాబట్టే అతను చాలా సమస్యలలో ఉన్నాడు.   

మానసిక శరీరం బాహ్య సమాచారం పై ఆధారపడి పనిచేస్తుంది.  అదే అనుభూతి శరీరంతో పనిచేస్తే  సమాచారం అంతరం నుండి వస్తుంది..  ఆనందకరమైన జీవితాన్ని పొందుతాడు...మీరు మానసిక శారీరంతో  పని చేస్తున్నంత కాలం...  అంతరంలో ఉన్న జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటారు .   ఆ పని కర్మగా పరిణమిస్తుంది...ఈ విధంగా ఎన్నో కర్మల అనంతరం మీరు కర్మ చక్రంలో బంధీ అవుతారు..తద్వారా జన్మ చక్రం ప్రారంభమవుతుంది.   అదే మీరు అనుభూతి శరీరంతో పనిచేస్తే ఇదే ఆఖరి జన్మ అవుతుంది..అనుభూతి శరీరం తో పనిచేయాలంటే ధ్యానం చేస్తే అది సాధ్యపడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.. 

శారీరక...  మానసిక పరిస్థితులు అధ్వాన్నంగా వుండేవారు..  కనీసం రోజుకు రెండు సార్లు  ధ్యానం చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.  అవి వెంటనే రాకపోవచ్చు.. సాధనద్వారా  క్రమేణా  సత్ఫలితాలను అందుకుంటారు. అంతేకానీ.    ప్రతిసారీ ఏదో మొక్కుబడిగా 10 నిమిషాలు కూర్చుని . చాలా రోజుల నుంచీ ధ్యానం చేస్తున్నాను  నాకు ఏమీ ఫలితం కనిపించడం లేదు,  ఇంట్లో వాళ్ళూ సహకారం ఇవ్వటంలేదు, వ్యాపారం వల్ల వీలుకావడంలేదు" అనుకుంటే ఏమీ లాభంలేదు.. గత జన్మలో మీ కర్మ ఫలము ఎలా ఉందో దాని బట్టే ఉంటుంది. 

గొప్ప యోగులు కావాలంటే జీవితంలో ఎంతోసేపుధ్యానం చేయాలి.  గంటల తరబడి ధ్యానంలో ఉండాలి.  అందుకే ఎలాంటి ఆంటకాలు లేకుండా... దూరంగా .. సైలంట్​ గా ఉండే ప్రదేశంలో  ధ్యానం చేసేవారు. కోరింది దక్కాలనుకుంటే వయస్సుకు తగినంతసేపు ధ్యానం చేసితీరాలి.  మన భారతీయ మహర్షులు అందుకే ధ్యానాన్ని మనుషుల జీవితంలో భాగం చేశారు. కానీ అందరూ పాశ్చాత్య సంప్రదాయాల మోజులో పడి జీవితానికి శక్తినిచ్చే గొప్ప ధ్యాన ప్రక్రియను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మళ్లీ దాని అవసరం వచ్చింది. అందుకే మళ్లీ ఇటువైపు మళ్లుతున్నారు.