వట సావిత్రి వ్రతం.. పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేయొచ్చు.. ఎలాగంటే..

వట సావిత్రి వ్రతం.. పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేయొచ్చు.. ఎలాగంటే..

హిందువులు పూజలకు.. వ్రతాలకు.. ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.   స్త్రీలు తమ ఐదవ తనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు చేస్తారు.  మంగళ గౌరీ వ్రతం... వరలక్ష్మీ వ్రతతాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో జ్యేష్ఠమాసంలో ఉండే వట సావిత్రి వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి.

వటసావిత్రి వ్రతాన్ని పెళ్లి అయిన వారు  సకల సౌభాగ్యాలనూ ప్రసాదించడంతో పాటు వైధవ్యం నుండీ కాపాడే వ్రతం,వట సావిత్రీ వ్రతం.ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు కానీ,  జ్యేష్ఠ పూర్ణిమ  నాడు ఆచరించాలి. ఈ ఏడాది వట సావిత్రి వ్రతాన్ని మే 26 అమావాస్య మరియు జూన్ 10 వ తేదీన  జరుపుకుంటారు. 

అయితే కొంతమంది  పెళ్లాకాని అమ్మాలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  మంచి భర్త రావాలని.. ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  ఇంకా రిలేషన్​ షిప్​ లో ఉన్నవారు.. వారి సంబంధం.. కాస్త పెళ్లిగామారి.. కలకాలం జీవించేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎవరు ఎలా చేయాలో తెలుసుకుందాం..!

వటసావిత్రి వ్రతం ఎలా చేయాలంటే 

హిందువులు మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. వటవృక్షం వేళ్లకు బ్రహ్మదేవుడు, కాండానికి శ్రీ మహావిష్ణువు, కొమ్మల భాగంలో పరమేశ్వరుడు నివాసం ఉంటారని చెబుతారు. త్రిమూర్తులను పూజిస్తూ...తన భర్త కూడా వటవృక్షంలా కుటుంబానికి అండగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని పూజిస్తారు. ఈ పూజ పూర్తిచేసిన తర్వాత సావిత్రి-సత్యవంతుడి కథ వినడం ద్వారా వ్రత ఫలితం దక్కుతుంది. ఈ రోజంతా ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. 

వివాహిత మహిళలు..

వివాహిత మహిళలు..వటసావిత్రి వ్రతం రోజు...మర్రిచెట్టును సింధూరంతో అలంకరించి నూలుదారం పోగులని చెట్టుచుట్టూ కడతారు. చెట్టు చుట్టూ దారం చుడుతూనే 108 ప్రదక్షిణలు ...నమో వైవశ్వతాయ నమః ...అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తారు. పసుపు,కుంకుమ, పూలు, గాజులు లాంటి సౌభాగ్యానికి నిదర్శమనమైన వస్తువులను చెట్టువద్ద ఉంచుతారు.  భర్త జాతకంలో దోషం ఉంటే తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులుచెబుతున్నారు. 

పెళ్లికాని అమ్మాయిలు... 

 పెళ్లికాని అమ్మాయిలు తాము కోరుకున్న  వారిని భర్తగా పొందడానికి .. ఆయన ఆశీర్వాదం కోసం  ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  లివింగ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తున్న అమ్మాయిలు తమ భాగస్వామిని వివాహం చేసుకోవడానికి ఉపవాసం పాటిస్తారు. పెళ్లికాని వారు మర్రి చెట్టు వేరుకు పాలు.. నీళ్లను సమర్పించాలి.  చెట్టు కింద ఆవునెయ్యితో దీపం వెలిగించాలి.. పసుపు కుంకుమతో పూజించాలి.  మర్రి చెట్టూ చుట్టూ 51 ప్రదక్షిణలు చేయాలి.   ఇలా చేస్తే వివాహంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

ఇక అందరూ కూడా    విష్ణువు, శివపార్వతులను ధ్యానించి,  విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.  ఓం నమ:శివాయ: నమ: అనే మంత్రాన్ని  108 సార్లు జపించండి.  గౌరీ మాతకు ( మర్రి చెట్టుకు)  అలంకరణ వస్తువులను (పసుపు.. కుంకుమ.. గాజులు.. గంధం )  సమర్పించండి. గౌరీ అష్టోత్తరం చదివి పూజ చేయండి. శక్తి మేరకు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి.   తరువాత వటసావిత్రి పురాణ కథను చదవాలి.

పూజలో భాగంగా ఈ శ్లోకం పఠించాలి

 బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరిష్యే

పురాణకథ

ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రి, సత్యవంతుల కథ ఉంది. ఈ వ్రతం ఆచరించే సావిత్రీ తన భర్త సత్యవంతుని మృత్యువు నుంచి కాపాడుకోగలిగింది. అశ్వపతి- మాళవి దంపతుల కూతురు 'సావిత్రి' యుక్తవయసులో ఉండగా.. నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి తనయుడైన సత్యవంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్యవంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్పటికీ, సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశారు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది.

సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం అడవికి బయలుదేరగా, సావిత్రీ భర్త వెంట వెళ్లింది. సమిధులను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది. కొద్ది సేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావిత్రిని వరం కోరుకోమన్నాడు.

'మామగారికి దృష్టి ప్రసాదించండి' అని ఓ వరాన్ని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా.. 'నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి' అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథనం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి 'వట సావిత్రి వ్రతం' అమల్లోకి వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.